ఎపిలో బీఎడ్ పరీక్ష లీక్ కేసులో ముగ్గురి అరెస్ట్
Published on: Sat Mar 8, 2025 12:52PM
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీక్ అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్పరీక్ష జరగాల్సి ఉండగా... పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ లీక్ అయ్యింది. దీనిపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రియాక్టై పరీక్షను రద్దు చేశారు.
కాగా, ఈ పేపర్ లీక్ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పేపర్ లీక్ తో సంబంధం ఉందని భావిస్తున్న ముగ్గురు నిందితులును పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు ఒడిశాకు చెందినవారే.


