20శాతం మంది నేరచరితులే
posted on Jul 13, 2013 2:34PM
నేరచరితులకు ఎలక్షన్స్లో పోటి చేసే అర్హత నేపథ్యంలో కోర్టు ఇచ్చిన సంచనల తీర్పుతో ఇప్పుడు అందరి దృష్టి చట్టసభల్లోని నేరచరితలపై పడింది.. రాజకీయనాయకులుగా చలామణి అవుతున్న చాలామంది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక కేసులో ఇరుక్కున్న వారే దీంతో అసలు అలా క్రిమినల్ రికార్డ్ ఉన్న వారిపై ఓ లెక్కతేల్చింది ఓ ప్రైవేట్ సంస్థ.
ప్రస్థుతం చట్ట సభల్లో ఉన్నవారిలో రాష్ట్రం నుంచి 20శాతం మంది అంటే దాదాపు 54మంది ఎమ్ఎల్ ఎలు, 14 మంది ఎంపిలకు క్రిమినల్ రికార్డ్ ఉందట.. అంతేకాదు దాదాపు 90 మంది ఎమ్ఎల్సి లపై కేసులు ఉన్నాయి.. అయితే ఈ లిస్ట్లో అందరికంటే ఎక్కువగా ఎమ్ ఐ ఎమ్ పార్టీకి సంభందించిన 71 శాతం మంది ఎమ్ఎల్ఎ లు కేసుల్లో ఉన్నారు..
కోర్టు తీర్పును ఎటువంటి లోసుగులు చూపించకుండా అమలు చేయగలిగితే 2014 ఎన్నికలల్లో దాదాపు సగం మందికి కొత్త నేతలే చట్ట సభల్లో అడుగుపెట్టే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు..