వెంకన్నకు సమైక్య సెగ

 

సీమాంద్రలో వెల్లువెత్తున్న సమైక్య సెగలు తిరుమలేషునికి కూడా తాకాయి. విద్యుత్‌ ఉద్యోగుల సమ్మెతో భారీగా విద్యుత్‌ ఉత్పత్తి పడిపోయింది. దీంతో తిరుమలకు కూడా కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. తిరుమల చరిత్రలో కరెంట్‌ సరఫరా నిలిచిపోవటం ఇదే తొలి సారి అంటున్నారు అక్కడి ప్రజలు.

 

తిరుమల కొండపై జనరేటర్‌లతో విద్యుత్‌ సరఫరా చేస్తున్నా అది స్వామి వారి ఆలయానికి, సేవలకు మాత్రమే సరిపోతుంది. దీంతో ఇతర వసతి గ్రుహాలకు, హాటల్లకు ఇతర అవసరాలకు కరెంట్‌ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి కొన్ని గంటలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.