బిగ్బజార్లో బిగ్ చోరీ
posted on Aug 24, 2014 4:55AM
హైదరాబాద్లోని కాచిగూడలో వున్న బిగ్బజార్లో భారీ చోరీ జరిగింది. సంస్థలో గతంలో పనిచేసిన సెక్యూరిటీ గార్డులే దొంగలుగా మారి 50 లక్షలకు పైగా విలువైన లాప్ట్యాప్లు, స్మార్ట్ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దోచుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగింది. గతంలో బిగ్బజార్ లో పనిచేసి, మానివేసిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులుపక్కా ప్రణాళికతో చోరీ చేశారని సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా తెలుస్తోంది. అసోం, అరుణాచల్ప్రదేశ్లకు చెందిన పప్పుదాస్, కమల్దాస్, రజినిపెగ్లు బిగ్బజార్లో 3వ ప్లోర్లోని ఫైర్ఎగ్జిట్ ద్వారం నుంచి 2వ అంతస్తులోని ఎలాక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించి అక్కడున్న ఖరీదైన ల్యాప్ట్యాప్లు, స్మార్ట్ ఫోన్లు, కెమెరాలను, తర్వాత పక్కనే ఉన్న స్టోర్రూమ్, స్టాఫ్రూమ్ల తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి రెండు బీరువాల తాళాలను పగులగొట్టి అందులో ఉన్న ఖరీదైన సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. మొత్తం పరికరాల విలువ 50 లక్షలకు పైనేనని సిబ్బంది చెబుతున్నారు.