వి.హెచ్ రాక్షసుడు..!

 

 

 

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుపై మంత్రి టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆనాటి హనుమంతుడు గొప్ప రామ భక్తుడైతే, ఈ నాటి కలియుగ హనుమంతుడు వీహెచ్ కుప్పిగంతులు వేస్తున్నారని” ఆ హనుమంతుడు దైవాంశసంభూతుడైతే, ఈ హనుమంతుడు రాక్షస జాతికి చెందిన వాడని” ఘాటుగా విమర్శించారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్పితే, ఆయన చేసేదేమీ లేదని విమర్శించారు. కిరణ్, చంద్రబాబు, జగన్ లు ఐక్యంగా పోరాడితే రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, అలాంటి ఆయన గురించి మాట్లాడే అర్హత కుప్పిగంతులు వేసే హన్మంతరావుకు లేదని, విభజన వల్ల రాయలసీమ, కోస్తా జిల్లాలకు అన్యాయం జరిగిందని, తమకు ఉరి శిక్ష వేసి శాసనసభలో చర్చ పెట్టమనడం, అందులో పాల్గొనమనడం అన్యాయమని టీజీ అభిప్రాయపడ్డారు.