TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావోయిస్టుల మకాంతో కర్రె గుట్టలపై టెన్షన్ వాతావరణం

Published on: Fri Apr 11, 2025 3:18PM

మావోయిస్టులు  శాంతి చర్చలు జరపడానికి సిద్దమై రెండు వారాలు గడుస్తున్నప్పటి కేంద్రం   ఇంత వరకు స్పందించక పోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో ఎన్ కౌంటర్లకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.  వచ్చే మార్చికల్లా నక్సల్ రహిత దేశం తయారు చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.  కర్రెగుట్టలపై మావోయిస్టు లు షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకోవడంతో  తెలంగాణ ప్రభుత్వం భధ్రతా  బలగాలను రంగంలో దించినట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలు దాదాపు 150 కిలో మీటర్ల దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. ఎత్తయిన ఈ గుట్టలపై పోలీసులు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఒకవేళ కర్రెగుట్టలపై వెళితే భారీ ప్రాణ నష్ట సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే మావోయిస్టులు వివిధ  కమిటిల పేరిట లేఖలు విడుదల చేస్తున్నారు.  కర్రెగుట్టలపై రావొద్దనేది  ఆ లేఖల సారాంశం.  అమాయక గిరిజనులు కర్రెగుట్టలపై రావొద్దని  ఓ వైపు మావోయిస్టులు చెబుతుంటే పోలీసులు మాత్రం కర్రెగుట్టలపై వెళ్లి అడవి సంపదను వినియోగించుకోవాలని చెబుతున్నారు. తాజాగా శుక్రవారం  మలుగు ఎస్పీమీడియా సమావేశం ఏర్పాటు  చేసి గిరిజనులు కర్రెగుట్టల వైపు వెళ్లాలని కోరుతున్నారు. గిరిజనులు కర్రెగుట్టలపై ఉన్న ఇప్పపువ్వు వంటి అడవి సంపదపై ఆధారపడ్డ గిరిజనులు కర్రెగుట్టల వైపు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. కర్రెల గుట్టల్లో మావోయిస్టులు ఎక్కువకాలం ఉండలేరు. తినే పదార్థాలు, వైద్య సదుపాయాల కోం మావోయిస్టులు గుట్టలు దిగే పరిస్థితి ఉంది.  మావోయిస్టులు కర్రెగుట్టల క్రిందకు దిగే సమయంలో అరెస్ట్ లు జరుగుతున్నాయి. అనారోగ్యంతో ఉన్న మావోయిస్టులు కర్రెగుట్టలు దిగే సమయంలో లొంగిపోతున్నారని మావోయిస్టులు విడుదల చేసిన లేఖల్లో పేర్కొన్నారు. కేంద్ర కమిటీ నాయకత్వంతో బాటు వివిధ రాష్ట్రాల నాయకత్వం కర్రెగుట్టలపై మకాం వేసినట్టు తెలుస్తోంది. కర్రెగుట్టలు ఎక్కువ భాగం చత్తీస్ గడ్ లో ఉన్నాయి. తెలంగాణలోని ములుగు జిల్లాలో కొంత భాగం ఉంది.  చత్తీస్ గడ్ లో వరుస ఎన్ కౌంటర్లు  జరుగుతున్నాయి. వందలాది మంది మావోయిస్టులు చనిపోయారు. ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం నగదు పారితోషికం ఇచ్చి పునరావాసం కల్పించడంతో మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్దమైనట్లు తెలుస్తోంది.