గుడివాడ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత...

గుడివాడ వలివర్తుపాడు గ్రామంలో పేకాటరాయుళ్ల పై పోలీసుల దాడులు చేసి పేకాట ఆడుతున్న వ్యక్తులను చితకబాదారు. ఈ దాడుల్లో రత్న కుమార్ అనే వ్య‌క్తిని ఎస్ఐ మరియు సిబ్బంది కొట్టడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. పోలీసు లాఠీల‌కు గాయ‌ప‌డిన ర‌త్న‌కుమార్‌ను ఘటనా స్థలం నుండి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అత‌ను దారిలోనే మృతిచెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు.

పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున మృతుడు బంధువులు చేరుకోవ‌డంతో గుడివాడ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసులు అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మృతుడి బంధువులు ఆరోపించారు. మ‌రి దారుణంగా పోలీసులు కొట్టి చంపేశారనే వార్త గుడివాడ‌ల సంచ‌ల‌నం రేపింది.