పురంధేశ్వరికి షాక్.. ఎంపీ అభ్యర్థిత్వం చెల్లదు!!

 

బీజేపీ మహిళా నేత పురంధేశ్వరికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఆమె అభ్యర్థిత్వంపై కోర్టుకి వెళ్లనున్నట్లు తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ తెలిపారు. సోమవారం సచివాలయంలో సీఈవోను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘పురంధేశ్వరి ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ పోస్టుకు రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని సీఈవోకు విజ్ఞప్తి చేశాం. భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గత ఎన్నికల్లో తాను ఏమీ చదువుకోలేదని అఫిడవిట్‌లో రాశారు. ఈ ఎన్నికల్లో డిగ్రీ చదువుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ముందే ఫిర్యాదు చేశాం. విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఈసీ.. ఎన్నికలు పూర్తయిన తర్వాత తామేమీ చేయలేమని, కోర్టును ఆశ్రయించమని సూచించింది. పురంధేశ్వరి, ముత్తంశెట్టితోపాటు ఈసీపైనా కోర్టుకెళ్తాం" అని రామ్‌ పేర్కొన్నారు.