ఇరాక్: తిరిగొచ్చిన తెలుగువారు!!

 

ఇరాక్ దేశం అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోంది. ఉపాధి కోసం ఇరాక్‌కి వెళ్ళిన తెలుగువారు అక్కడ చిక్కుకుపోయారు. వారిని ఇండియాకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాక్‌‌లో చిక్కుకున్న 193 మంది తెలుగువారు ఢిల్లీకి ఆదివారం చేరుకున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ద్వారా ఢిల్లీ చేరుకున్న వారు ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ ఉమ్మడి భవన్‌లో బస చేశారు. వీరిలో 25 మంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విశాఖ జిల్లాకు చెందినవారు కాగా, మిగతావారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందినవారు. వీరిని ఎవరి స్వస్థలాలకు వారిని పంపించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇరాక్‌లో ఇంకా వందల సంఖ్యలో తెలుగువారు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.