మోత్కుపల్లిపై చర్యలు తప్పవు

టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలంటూ ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. మోత్కుపల్లిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందని అన్నారు. మోత్కుపల్లి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలను కార్యకర్తలెవ్వరూ ఒప్పుకోరని అన్నారు.

 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు వర్గంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి.... పార్టీ రోజు రోజుకు నిర్వీర్యం అయిపోతోందని మాటలు వింటుంటే బాధనిపిస్తోందని.. పార్టీని ఎంతలా జనాల్లోకి తీసుకెళ్దామన్నా సహకరించేవారు లేరన్నారు.. టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, నేతలంతా తెలుగు దేశం పార్టీ వారే కనుక ఆ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు.