రేవంత్, రమణ అరెస్ట్..

గోదావరి నదిపై ప్రాజెక్ట్‌ల విషయంలోమహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని టీటీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జలసౌధ వరకు ర్యాలీగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్రతో ఒప్పందంతో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెడుతోందని..ఆ ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా నేపథ్యంలో లక్డీకాపూల్ నుంచి ఎర్రమంజిల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో.. పోలీసులు రమణ, రేవంత్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.