తెలంగాణకు మరో ఘనత... 'మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్'

 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేశ వ్యాప్తంగా మంచి పేరే ఉంది. అంతేకాదు ఆ మధ్య ప్రధాని మోడీ ముఖ్యమంత్రుల పనితీరు ఆధారంగా ఎవరు బెస్ట్ అనే దానిపై నిర్వహించిన సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పుడు సర్కార్ అవలంభిస్తోన్న విధి విధానాలకు కూడా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ గా తెలంగాణ రాష్ట్రానికి అవార్డ్ దక్కింది. తాజాగా ప్రముఖ జాతీయ ఛానెల్ సీ.ఎన్.బీ.సీ అనే సంస్థ.. ఆయా రాష్ట్రాల్లో వ్యాపార అనుకూల పరిస్థితులు, అందుకోసం రాష్ట్రాలు అవలంభిస్తోన్న విధానాలను పరిగణలోకి తీసుకుని ప్రతీ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది. అయితే ఈసారి కూడా సర్వే నిర్వహించగా.. ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ గా ఎంపికయింది. అవార్డును స్వీకరించాల్సిందిగా ఇప్పటికే సీఎన్ బీసీ నుంచి తెలంగాణ సర్కార్ కు ఆహ్వానం అందింది. అగస్టు 30వ తేదీన గ్రాండ్ న్యూఢిల్లీలో ఉన్న వసంత్ కుంజ్ ఫేస్ 2లో సాయంత్రం 5.30గం.లకు జరగబోయే కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అవార్డును అందుకోనున్నారు.