తెలంగాణ హైకోర్టుకు రంగం సిద్ధం

 

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంగీకారం తెలిపినట్టు సమాచారం అందుతోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్దయర్శి రాజీవ్ శర్మ గురువారం ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు గురించి చర్చించారు. హైకోర్టు ఏర్పాటుకు చీఫ్ జస్టిస్ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో కింగ్‌కోఠీలోని పరదా ప్యాలెస్ లేదా ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ డి భవనంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుత హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకే తాత్కాలికంగా కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం.