ఓయులో ఉద్రిక్తత
posted on Jun 12, 2013 6:57PM
తెలంగాణ రాజకీయ జేఏసీ ఛలో అసేంబ్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో దానికి మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయలయంలో విద్యార్థులు ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులు ర్యాలీగా వస్తుండగా ఎన్ సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని విద్యార్థులు చెప్పినా పోలీసులు వినకపోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదాలు జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. లాఠీ ఛార్జ్, బాష్పవాయువు ప్రయోగాలతో ఉస్మానియా అట్టుడుకుతోంది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్రమ అరెస్టులు, బైండోవర్లకు ఎట్టి పరిస్థితులలోనూ భయపడం అని, ఖచ్చితంగా ఛలో అసేంబ్లీ జరుగుతుందని విద్యార్థి నేతలు అంటున్నారు.