కేభినెట్‌ ముందకు టి నోట్‌

 

25 నుంచి ప్రదాని విదేశి పర్యటన నేపధ్యంలో ఈ 24 న జగరనున్న ప్ర్యతేక కేభినేట్‌ సమావేశంలోనే తెలంగాణ నోట్‌పై చర్చించనున్నారు. భారత్‌ అమెరికా మధ్య జరిగిన అణు ఒప్పందాల వ్యవహారాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం అవుతున్న కేభినేట్‌ పనిలో పనిగా తెలంగాణ నోట్‌పై కూడా చర్చించనుందని సమాచారం.

ఇప్పటికే నోట్‌ రెడీ అయినట్టుగా ప్రకటించిన హోం మంత్రి షిండే పలువురు సీమాంద్ర కేంద్ర మంత్రులకు నోట్‌ కాపీని కూడా అందించారట. ఎలాంటి సాంకేతిక పరమైన అంశాలను ప్రస్తావించకుండా రెడీ చేసిన ఈ నోట్‌లో, మంత్రుల బృందం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్టుగా తెలుస్తుంది.

నోట్‌ కేభినెట్‌ ముందుకు వచ్చిన దగ్గర నుంచి ఇక తెలంగాణ ఏర్పాటుకు సంభందించిన అన్నిఅంశాలు మంత్రి వర్గమే చూడనుంది. అయితే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు ఆంటోని కమిటీకి ఎలాంటి సంబందం లేదని తేల్చిన కేంద్ర, ఎవరికి ఏ అభ్యంతరాలు ఉన్న ఆంటోరి కమిటీకే నివేదించుకోవాలని చెపుతుంది.