తెలంగాణ నోట్‌పై గ‌డికో మాట‌


రాష్ట్రవిభ‌జ‌న అంశంపై గంట‌కో ర‌కంగా మాట్లాడుతుంది కాంగ్రెస్‌. రాష్ట్రవిభ‌జ‌న నుంచి వెన‌క్కి త‌గ్గేది లేదు అంటునే సీమాంద్రుల‌కు విభ‌జ‌న జ‌ర‌గ‌దు అన్న హామి ఇస్తుంది. ఏక‌భ్రియం లేకుండా తెలంగాణ అంశంపై ముందుకు వెళ్లేది లేద‌ని అహ్మద్ ప‌టేల్‌, మొయిలీ చెప్పి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే తెలంగాణ నోట్ రెడీ అయిన‌ట్టుగా ప్రక‌టించారు హోం మంత్రి షిండే.

ఇప్పటికే అధికారులు రెడీ చేసిన తెలంగాణ నోట్ త‌న వద్దకు వ‌చ్చింద‌న్న షిండే. రేపు ఆ నోట్‌ను ప‌రిశీల‌స్తామ‌న్నారు. నోట్ సంభందించి అధికారుల‌తో స‌మావేశం నిర్వహించిన త‌రువాత త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని ప్రక‌టించారు.