నోట్ ఇంకా రెడీ కాలేదు : సియం కిరణ్
posted on Sep 18, 2013 8:14AM
తెలంగాణ అంశంపై కేంద్రం ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మాత్రం రాష్ట్ర విభజన జరగదని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేబినేట్ నోట్ రెడీ అయిందని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో కిరణ్ మాత్రం ఆ వార్తలు ఖండిస్తున్నారు. ఈమేరకు సీమాంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో వారికి హామి ఇచ్చారు.
మంగళవారం కిరణ్తో భేటి అయిన సీమాంద్ర మంత్రులు కేభినేట్ నోట్ గురించి ప్రస్తావించగా, అది అంత త్వరగా పూర్తయ్యే విషయం కాదని సియం తేల్చి చెప్పారు. తొలుత నోట్ రెడీ చేసిన హోం శాఖ విభజనతో సంభందం ఉన్న పది శాఖలకు ఆ నోట్ను పంపిస్తారు. అక్కడి నుంచి పిఎంఓకు, కేభినేట్కు చేరుతుంది. ఈ ప్రాసెస్ అంతా అతి వేగంగా జరిగితేనే మూడు వారాలకు పైగా పడుతుంది. వీటిలో ఎక్కడ అభ్యంతరాలు వ్యక్తం అయినా ఇంకా ఆలస్యం అవుతుంది.
ఇప్పటి వరకు కేబినేట్ నోట్ రెడీ కాలేదన్న సియం ఈ రెండు మూడు రోజుల్లో జరిగే కేంద్ర మంత్రిమండలి సమావేశాల సమయానికి కూడా నోట్ సిద్దమయ్యే అవకాశం లేదన్నారు.