తెలంగాణలో కౌన్సిలర్ స్థానాల్లో అగ్రస్థానంలో కాంగ్రెస్

 

 

 

రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో నేలమట్టమైపోయింది. తెలంగాణ మాత్రం ఈ పార్టీ టీఆర్ఎస్‌ కంటే ముందంజలో వుంది. మొత్తం కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. తెలంగాణలో మొత్తం 1399 కౌన్సిలర్ స్థానాలు వున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 1321 కౌన్సిలర్ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 485 స్థానాలు గెలుచుకుంది. టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి 306 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈ పార్టీ 147 వార్డుల్లో గెలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలతో సరిపెట్టుకుంది.