తెలంగాణ రాజముద్రలో మార్పులు!

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లోగోలో మార్పులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన లోగో రాష్ట్రాల లోగో చట్టానికి అనుగుణంగా లేదని ఇటీవల కేసు నమోదు అయింది. మూడు సింహాల గుర్తు కిందనే దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే మాట వుండాల్సి వుంది. అయితే తెలంగాణ లోగోలో మాత్రం మూడు సింహాల గుర్తుకు, సత్యమేవ జయతే అనే మాటకు చాలా దూరం వుంది. ఈ విషయాన్నే ప్రశ్నస్తూ కేసు నమోదు అయింది. అలాగే కేంద్ర హోం శాఖ కూడా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేసింది. దాంతో లోగోని మార్చడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం తెలుగులో వున్న సత్యమేవజయతే అక్షరాలను దేవనాగరి లిపిలోకి మార్చడంతోపాటు సింహం గుర్తు, సత్యమేవ జయతే రెండు సమ్మిళితం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుంది.