హైకోర్టు వద్ద భారీ బందోబస్తు.. ఢిల్లీకి లాయర్లు..
posted on Jun 28, 2016 10:40AM
తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం చేస్తూ రూపొందించిన ఆ జాబితాను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లాయర్లు ఆందోళన చేపడుతున్నసంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నిన్న 120 మంది న్యాయాధికారులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా నిరసనలు చేపట్టారు. ఈ రోజు కూడా లాయర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో హైకోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. తనిఖీలు చేసిన వాహనాలనే కోర్టులోకి అనుమతిస్తున్నారు. మరో వైపు ఈ రోజు నుంచి చీఫ్ జస్టిస్ కోర్టును బహిష్కరిస్తామని లాయర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ లాయర్ల బృందం ఢిల్లీ వెళ్లనుంది. తెలంగాణ మంత్రులు, ఎంపీలతో కలిసి కేంద్రంలో కీలక మంత్రులకు వినతిపత్రం ఇవ్వనున్నారు.