తెలంగాణ మంత్రులకు పౌరుషం లేదు: కవిత

 

 

 

విభజన బిల్లును సీమాంధ్ర పాలకులు అడ్డుకుంటున్నా తెలంగాణ మంత్రులు నోరుమెదపడంలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. "తెలంగాణ ప్రాంత మంత్రులకు పౌరుషం లేదు. గట్టిగా మాట్లాడే ధైర్యం లేదు. వారిని ప్రజలు గమనిస్తున్నారు. తప్పక గుణపాఠం చెబుతారు'' అని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. "శవాల మీద ప్రమాణం చేసిన శ్రీధర్‌బాబు మంత్రి పదవిని ఎందుకు త్యాగం చేయలేదు? తెలంగాణ మంత్రులెవ్వరూ వచ్చే ఎన్నికల్లో గెలవలేరు'' అని మండిపడ్డారు.