‘సైకిల్’ ఎక్కనున్న కేటీఆర్?

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ త్వరలో ‘సైకిల్’ ఎక్కబోతున్నారు. ఇంతకాలం ‘కారు’లో ప్రయాణించిన ఆయన ‘కారు’ కంటే ‘సైకిల్’ బెటర్ అని భావిస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో ఆయన ‘సైకిల్’ ఎక్కే అవకాశం వుంది. ఇదేదో పార్టీలు మారే పొలిటికల్ మేటర్ కాదు.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో జరిగే ఓ సైకిల్ ర్యాలీలో పాల్గొని తాను కూడా సైకిల్ తొక్కబోతున్నారు. మొన్నామధ్య హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల ఉద్యోగులు ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీకి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కారులో తిరగడం కంటే సైకిల్ తొక్కడమే ఆరోగ్యాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ప్రజలు సైకిల్ తొక్కడానికి మళ్ళీ అలవాటు పడే విధంగా అలవాటు పడే విధంగా నగరంలో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా వుందని ఆయన అన్నారు.