TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

Published on: Wed Apr 22, 2015 11:29AM

 

తెలంగాణలో ఇంటర్మీడియల్ ప్రథమ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 55.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది మొత్తం 4,31,361 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,39,954 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 61.68 కాగా, బాలురు 49.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లా (71శాతం) మొదటి స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లా (43శాతం) చివరి స్థానంలో నిలిచింది. ఈ ఫలితాలపై మే 22వ తేదీ లోపు రీ-వెరిఫికేషన్ జరుపుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలి. మే 25 నుంచి అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయి.