గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవం

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా గోల్కొండ కోటలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసంలో కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.