తెలంగాణ సర్కారుకు సుప్రీం అక్షింతలు.. కొత్త రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏంటీ..

 

తెలంగాణ ప్రభుత్వానికి కోర్టులో చేతిలో మొట్టికాయలు తినడం కొత్తేమికాదు. ఏదో ఒక విషయంలో ఎప్పుడూ కోర్టుల చేత తిట్లు తిట్టించుకుంటునే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో విషయంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 398 ప్రభుత్వ పాఠశాల్లో 'సున్నా' శాతం అడ్మిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏమిటని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రాణం లేని మనిషితో సమానమని వ్యాఖ్యానించింది. విద్యార్థుల ప్రవేశాలు జరగకపోవడానికి గల కారణాలతో నివేదికను నాలుగు వారాల్లో సమర్పించాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 10కి వాయిదా వేసింది.