TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ధాన్యం మొత్తం కొంటాం.. ఉత్తమ్!

Published on: Tue Sep 24, 2024 11:17AM

రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ  పౌర సరఫరాల శాఖామంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందు కోసం తెలంగాణ వ్యాప్తంగా  7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.   మంగళవారం ఉదయం మఱ్ఱి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో 2023-24 ఖరీఫ్ పంట కొనుగోలుపై రాష్ట్రంలోనీ జాయింట్ కలెక్టర్ లు,జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా స్థాయి పౌర సరఫరాల శాఖా మేనేజర్లతో  సమీక్షా సమావేశం నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు.