సమగ్ర సర్వేపై హైకోర్టు న్యాయమూర్తి విచారణ

 

మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై హై కోర్టులో విచారణ ప్రారంభమైంది. కృష్ణయ్య అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో ఈ విచారణ జరుగుతోంది. ఈ విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. సమగ్ర సర్వే నిర్బంధం కాదని, ఇది ఐచ్ఛిక సర్వే అని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు ఇప్పటికే విన్నవించిన విషయం తెలిసిందే.