తెలంగాణలో ఫిక్స్‌ అయిన ప్రధాని మోడీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన అధికారికంగా కన్ఫార్మ్‌ అయ్యింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పీఎంవోకు సమాచారం అందింది. వచ్చే నెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని తొలిసారి పర్యటించనున్నారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరిస్తారు. ఏడో తేది మధ్యాహ్నం 3 గంటలకు గజ్వేల్‌ చేరుకుని..అనంతరం అదే రోజు సాయంత్రం 4.15కి హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బీజేపీ సమావేశంలో పాల్గొంటారు. తిరిగి రాత్రి 7 గంటలకు ప్రధాని ఢిల్లీ బయల్దేరి వెళతారు.