తెలంగాణ కాంగ్రెస్ కే పెద్ద మచ్చ

 

Telangana decision irreversible, congress, telangana, undavalli arun kumar, sonia gandhi

 

 

కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికే చాలా మచ్చలు పడ్డాయని, కానీ, సోనియా అధ్యక్షురాలైన తర్వాత ఎలాంటి మచ్చలూ పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అంటున్నారు. తెలంగాణ విషయంలో మాత్రం న్యాయ పరీక్షకు, ధర్మ పరీక్షకు నిలబడని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

 

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం ధర్మంగా చేశారని ఎవరూ భావించరని తెలిపారు. ఈ సంక్షోభం నుంచి కాంగ్రెస్ విజయవంతంగా బయటపడుతుందని తాను భావిస్తున్నానని, ఒకవేళ బయటపడకపోతే కాంగ్రెస్‌పై ఈ మచ్చ అలా ఉండిపోతుందని చెప్పారు.



సోనియాగాందీ నాయకత్వంలో కాంగ్రెస్ పై అసలు మచ్చే పడలేదని చెప్పడమే విచిత్రంగా ఉంటుంది. బొగ్గు కుంభకోణం కాని, కామన్ వెల్త్ కుంభకోణం కాని ఇవేవి కాంగ్రెస్ పైన, సోనియాగాంధీపైన పడిన మచ్చలు కాదని ఉండవల్లి ఎలా చెబుతారో తెలియదు.