తెలంగాణ నేత‌లతో సీమాంద్ర నాయ‌కుల చ‌ర్చ

 

రాష్ట్ర విభ‌జ‌న‌పై కేంద్ర త‌న ప‌ని తాను చేసుకుపోతుంటే, ఇరు ప్రాంతాల్లో జ‌రుగుతున్న ఉద్యమాల‌ను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు తెలంగాణ‌,సీమాంద్ర కాంగ్రెస్ నేత‌లు ముందుకు వ‌స్తున్నారు. ఈ మేర‌కు సీఎల్పీలో మంత్రి జానా రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి సీమాంద్ర మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస్‌లు క‌లిసి చ‌ర్చలు జ‌రిపారు.

తెలంగాణ ప్రక‌ట‌న‌తో పాటు త‌రువాత సీమాంద్రలొ జ‌రుగుతున్న ఉద్యమాల‌పై ఇరు ప్రాంత నేత‌లు చ‌ర్చ జ‌రిపిన‌ట్టు స‌మాచారం. దీంతో పాటు తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయంతో పాటు సీమాంద్రుల్లో నెల‌కొన్న భ‌యాందోళ‌న‌కు సంభందించి కూడా ఈ నేత‌లు చ‌ర్చించారు.

రాష్ట్ర విభ‌జ‌నకు వ్యతిరేఖంగా ఉద్యమంలో తీవ్రంగా పాల్గొంటున్న గంటా, ఏరాసు లాంటి నేత‌లు తెలంగాణ నేత‌ల‌ను క‌ల‌వ‌టంతో ఈ  స‌మావేశం ప్రదాన్యం సంత‌రించుకుంది.