గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.. 22న టీ క్యాబినెట్ విస్తరణ?

 

గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రాత్రి భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య రెండు గంటల పాటు సమావేశం జరిగింది. గవర్నర్ని కేసీఆర్ కలిసింది మంత్రివర్గ విస్తరణ కోసమేనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఇంకో అడుగు ముందుకేసి ఈనెల 22న మంత్రివర్గ వుంటుందని, కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరో ముగ్గురికి తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం వుందని చెబుతున్నారు. గవర్నర్‌తో కేసీఆర్ జరిపిన సమావేశంలో బడ్జెట్ సమావేశాల ఏర్పాటు అంశం, హైకోర్టు ఏర్పాటు అంశం కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది.