రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సుగుణ ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమల బయలుదేరారు కేసీఆర్. ఈ రాత్రికి అక్కడే బస చేసి రేపు తెల్లవారుజామున కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు.