TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ బీజేపీలో ముసలం..

Published on: Wed Dec 2, 2015 10:10AM

ఇప్పటి వరకూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, టీడీపీ మధ్యే అంతర్గత విభేధాలు ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న నేతల మధ్యే విభేదాలు ఉన్నట్టు మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. దీనికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కత్తి దుయ్యటమే నిదర్శం. గోషమహల్ నియోజకవర్గంగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ గత కొద్దికాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఇంత సడెన్ గా ఏమయిందో ఏమో ఉన్నట్టుంది కిషన్ రెడ్డిపై పడ్డారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణ పార్టీ అభివృద్ధి చెందటం లేదని.. ఆయనను తెలంగాణ అధ్యక్ష పదవి నుండి తీసేయాలని.. దీనిలో భాగంగానే ఆయన భాజపా అధినేత అమిత్ షా కు లేఖ రాశారు. ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని ఎదగకుండా చేస్తున్నారని.. తన వర్గం మీద ఉన్న కనీస శ్రద్ద పార్టీ మీద పెట్టి ఉంటే చాలా బాగుండేదని అన్నారు. దీంతో బీజేపీ వర్గంలో ముసలం ఏర్పడిందని రాజకీయవిశ్లేషకులు అనుకుంటున్నారు. అంతేకాదు ఈసారి కూడా తెలంగాణలో బీజేపీకి పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డి చేతికి ఇస్తే రాజాసింగ్ పార్టీలో ఉండే అవకాశం కూడా లేదు అని అంటున్నారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం రాజాసింగ్ ను వదలుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే హిందూ అతి వాదిగా పేరు తెచ్చుకున్న రాజాసింగ్.. ఓల్డుసిటిలో ఎంఐఎం పార్టీని ఎదుర్కోగల పార్టీ నేతగా ఎదిగారు దీంతో బీజేపీ నేతలు అంత తేలికగా రాజాసింగ్ ను వదలుకోరు అని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..