పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు..!
posted on Jan 10, 2014 4:02PM
తెలంగాణ బిల్లు రాష్ట్రపతి నుంచి రాగానే పార్లమెంట్ లో పెడతామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే అన్నారు. ఈ నెల 23 వరకు శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లు చర్చకు రాష్ట్రపతి గడువు విధించారని, ఆ తరువాత అది రాష్ట్రపతికి రాగానే మాకు పంపితే వెంటనే పార్లమెంటులో పెడతామని ఆయన వెల్లడించారు. ఒకవేళ పదిహేను రోజులు ఆలస్యమైతే పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతాయి. పిబ్రవరి ప్రథమార్థం నుంచి పదిహేను రోజులు పాటు పార్లమెంట్ సమావేశాలుంటాయని ఇప్పటికే కమలనాథ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని ..శాసనసభలో చర్చకు మరింత గడువు కోరాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దానికి రాష్ట్రపతి ఒప్పుకుంటారా ? లేదా ? అన్నది ఆయన మీదనే ఆధారపడి ఉంటుంది.