తెలంగాణ అసెంబ్లీలో జీఎస్టీ బిల్లు...

 

తెలంగాణ అసంబ్లీ సమావేశం ప్రారంభమైంది. రాజ్యసభలో ఆమెదం పొందిన రాజ్యాంగ సవరణ జీఎస్టీ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒకే దేశం-ఒకే పన్ను ఉండాలన్న ఉద్దేశంతో జీఎస్టీ బిల్లును తెచ్చారు.. పార్లమెంట్లో ఈబిల్లు ఆమోదించబడింది.. ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును ఆమోదించాయి..15 రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంది అని అన్నారు. అంతేకాదు జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలు పన్నులు నష్టపోతే ఐదేళ్లు కేంద్ర ప్రభుత్వమే భరించాలి... ఇంకా పెట్రోల్, ఎక్సైజ్ పన్నులకు ఈ బిల్లు వర్తించదు అని తెలిపారు.