ఏది ఏమైనా సభ జరిపితీరుతాం
posted on Aug 25, 2013 9:08AM
ఏది ఏమైనా హైదరాబాద్లో తలపెట్టిన సమైక్య సభను జరిపి తీరుతామన్నారు ఏపి ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్బాబు. మిలియన్ మార్చ్లు, శాంతి ర్యాలిల పేరు చెప్పి తమని భయపెట్టలేరన్న ఆయన, సభకు విభజనవాదులు భయపడుతున్నారంటే తెలంగాణ వాదం లేనట్టేనా అని ప్రకటించారు. శనివారం హైదరబాద్లో జరిగిన సమైక్య వాదుల సభకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో మద్దతు పలికారు.
సెప్టెంబర్ 7న హైదరాబాద్లో తల పెట్టిన సభకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సహకరించాలని కోరారు. ఫేస్బుక్ ట్విటర్ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. సమైక్యాంద్రను కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సమర భేరి సదస్సులను నిర్వహించనున్నట్లు తులసిరెడ్డి తెలిపారు.
రాష్ట్రాన్ని విభజించడం ఎవరి తరం కాదన్న పరకాల ప్రభాకర్, విభజన ఉద్యమాలు రాష్ట్రానికి కొత్త కాకపోయిన ప్రతిసారి సమైక్య వాదమే గెలిచిందన్నారు. తెలంగాణ వాదులు తాము ఇన్నాళ్లు శాంతియుతంగా ఉన్నామంటున్నారు. మరి నామీద నాగం జనార్ధన్ రెడ్డి జరిగిన దాడులు శాంతియుత పద్దతిలోనే జరిగాయా అని ప్రశ్నించారు. ఏది ఏమైనా హైదరాబాద్లో జరిగే సభ ఘనవిజయం సాదిస్తామన్నారు.