విద్యార్థులతో మోడీ ముఖాముఖి

 

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఒక ఆడిటోరియంలో 700 విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 12,500 పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఒక కోటి 20 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రసారాన్ని తిలకించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని ఇతర నగరాలకు చెందిన విద్యార్థులు కూడా మోడీని ప్రశ్నలు అడిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, విద్యార్థులు దేశానికి గర్వకారణంగా నిలిచేలా ఎదగాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు.