బాబుకు మద్దుతుగా యువచైతన్య సదస్సు


 

కాంగ్రెస్ అవినీతి పాలనతో రావణకాష్టంలా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబును మళ్ళీ అధికారంలోకి రావాలని యువత కోరుకుంటుంది. ఆయనకు మద్దుతుగా ఐటీ మరియు ఇతరరంగాలకు చెందిన యువకుల కలిసి ఈనెల 25న కూకట్ పల్లిలో హౌసింగ్ బోర్డు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యువచైతన్య సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సు కు ముఖ్య వాలంటీరుగా నారా లోకేష్ ను ఆహ్వానించనున్నారు.  ఇందుకోసం  www.bringbabuback.org ఒక వెబ్ సైట్ ను కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా ''బాబును మళ్ళీ తెచ్చుకుందాం...రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుందాం'' అన్న నినాదంతో యువతను ముందుకు రావాలని కోరుతున్నారు. దీనికి కూడా మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎనిమిది వేలమంది వెబ్ సైట్ ద్వారా ముందుకు వచ్చారు.