TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికలు ఎప్పుడొచ్చినా .. టీడీపీదే జయం ..విజయం ఎలైట్ ముందస్తు సర్వే చెప్పిన నిజం

Published on: Fri Jun 10, 2022 4:06PM

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక విధమైన గందరగోళం ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ లేదు. ప్రజాభిప్రాయం చాల స్పష్టంగా వుంది ... ఒక్క ఛాన్స్ ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తానని, ఒక్క అవకాశం కోసం అదే పనిగా ప్రాధేయపడిన, జగన్మోహన్ రెడ్డికి జనం 2019లో ఒక అవకాశం ఇచ్చారు.. కానీ, మూడేళ్ళ తర్వాత ఇప్పుడు, జగన్ రెడ్డి మాట నిలుపుకున్నారా? అద్భుతాలు సాధించారా? రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్ళరా అంటే ... జనం పెదవి విరుస్తున్నారు. అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. 2019 ఎన్నికలలో తాము తీసుకున్న నిర్ణయం తప్పని, ఏకంగా 47.37 శాతం మంది ఓటర్లు స్పష్టం చేశారు. వైసీపే ప్రభుత్వం తమ ఆశలను వమ్ము చేసిందని చెప్పు కొచ్చారు. 38.46 శాతం మంది మాత్రమే, తమ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. తప్పును ఒప్పుగా పేర్కొన్నారు. మరో 14.16 శాతం మంది అటూ ఇటూ కాకుండా ఉన్నారని  ఎలైట్ ఎలక్టోరల్ సంస్థ నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది.  

ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి సామర్ధ్యం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీల పనితీరు, ప్రాధాన్యతలు, సమర్ధ్య  నాయకత్వం.. ముఖ్యమంత్రి, చివరకు ఈ సారి ఓటేవరికీ .. అనే విభిన్న ప్రశ్నల ప్రామాణికంగా, ఎలైట్ ఎలక్టోరల్ సంస్థ నిర్వహించిన సర్వేలో  ఏపీ ఓటర్లు, క్లియర్ కట్’ గా వైసీపెకి వ్యతిరేకంగా తీర్పు నిచ్చారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు నాయకత్వాని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనే విషయాన్ని ఈ సర్వే మరో మారు సపష్టం చేసింది.   

ఎలైట్ ఎలక్టోరల్ సంస్థ ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 ( 20.02.2022) నుంచి మార్చి 05, 2022 వరకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 35 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 350  పోలింగ్ బూతుల పరిధిలో అన్నివర్గాలకు చెందిన 10, 500 మంది ఓటర్లను వ్యక్తిగతం ఇంటర్వ్యూ చేసి, Stratified Random Sampling, పద్దతిలో  సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను ప్రామాణికంగా తెస్సుకుని రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల పరిస్థితిని విశ్లేషిస్తే, ఎన్నికాలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ తరిగి అధికారంలోకి రావడం తధ్యమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే విధంగా, ఏపీ పోటీ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది మూడో పార్టీకి అవకాశం లేదని విష్యం కూడా సర్వే స్పష్టం చేసిద్నై విశ్లేషకులు అంటున్నారు. మూడో స్థానంలో ఉన్న జన సేనకు మొదటి రెండుస్థానల్లో ఉన్న టీడీపీ, వైసీపీలకు మధ్య ఏ ప్రమాణం ఆధారంగా చూసినా గ్యాప్ .. భారీగా.. భయంకరంగా ఉందని, అందుకే, ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యనే ఉంటుంది.. అంతిమంగా టీడీపీ విజయం సాధిస్తుందని అంటున్నారు. 
ఈ సర్వే ఫలితాల ప్రకారం, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ కొంచెం అటూ ఇటుగా ప్రభుత్వ వ్యతిరేక పస్పుటంగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం మాకొద్దు’ అనే మాటే మూడు ప్రాంతాల్లో వ్యక్తమైంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజాక వర్గాలకు గానూ, 35 నియోజకవర్గాల పరిధిలోని 10,500 ని సర్వే చేస్తే అందులో,  కేవలం 2635 (25.09 శాతం) మంది మాత్రమే ప్రభుత్వ పనితీరు పట్ల సంపూర్ణ సంతృప్తిని వ్యక్తపరిచారు, మరో 2067 (19.68 శాతం) మంది ఫర్వాలేదని పెదవి విరిచారు. మరో 3321 (31.63 శాతం) మంది .. అసంతృప్తిని వ్యక్తపరిచారు. అలాగే, 2477 (23.59 శాతం) మంది అయితే, ఛీ ..ఛీ అంటూ సంపూర్ణ అసంతృప్తిని వ్యక్తపరిచారు.  

పార్టీల పరంగా చూస్తే, 4515 (43 శాతం)  ఓట్లతో తెలుగు దేశం పార్టీ  ప్రధమ స్థానంలో వుంది. వైసీపీ, 4111 (39.15 శాతం) ఓట్లతో రెండవ స్థానంలో వుంది. మూడవ స్థానంలో నిలిచిన జనసేనకు 1103 (10.50 శాతం) ఓటర్లు, ఫోర్త్ ప్లేస్’లో నిలిచిన బీజీపీకి 135 (1.28 శాతం) ఓటర్లు మద్దతు పలికారు. అంటే, ప్రస్తుత పరిస్థితిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచినా టీడీపీకి వైసీపీ కంటే 3.85 శాతం ఓట్లు అధికంగా పోలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.  

అదే విధంగా, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందని అడిగితే,చంద్రబాబు నాయుడు సిఎం కావాలని,4506 మంది అంటే 42.91 శాతం మంది కోరుకుంటున్నారు.కేవలం 39.09 శాతం (4102)  మంది మాత్రమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమత్రి కావాలని కోరుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారు, 1112 మంది మాత్రమే, అంటే కేవలం 10.59 శాతం మంది మాత్రమే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.ముఖ్యమంత్రి  రేసులో ఉన్నామని అనుకుంటున్న మిగిలిన అందరికీ కలిపి 7.44 శాతం ( 782) మంది ఓటేశారు. 

ఈ ఫలితాలను బట్టి చూస్తే, వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల జనాలకు మూడేళ్ళకే ముఖం మొత్తిందనే విషయం స్పష్టమవుతోందని సర్వే విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, అన్ని సర్వేలలోలానే, ఈ సర్వే లోనూ ఫలితాలు  ప్లస్ ఓర మైనస్ 3 శాతం అతూ ఇటు అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 

ఇదిగాక రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రజలు ఆందోళన చేడుతున్నారని సర్వేలో సప్ష్టమైంది. మొత్త 10, 50౦ మందిలో 28. 36 శాతం మంది  రాష్ట్ర రాజకీయాలు చాల చాల సంక్లిష్టంగా ఉన్నాయని అంటే, 17.06 మంది స్వార్ధపూరిత అవకాశవాదరాజకీయాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. మరో 27.12 శాతం మంది రాష్ట్ర రాజకీయాలు ప్రమాదకర పోకడలు పోతున్నాయని ఆందోళన వ్యక్త పరిచారు.