ఎంపీ విజయసాయిరెడ్డి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన అయ్యన్నపాత్రుడు

ఏపీలో బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ రాజధాని అమరావతి గురినిచి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ ఇంటర్వ్యూ పై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. "పురంధేశ్వరి ఈరోజు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ తొ, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది" అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ‌పై పలువురు నెటిజన్లు.. అలాగే బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒక ప్రెస్ మీట్ ద్వారా స్పందించారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన విజయసాయిపై ఫైర్ అయ్యారు. అసలు విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షి అని అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

 

"నందమూరి కుటుంబం అంటే ఒక తులసీవనం లాంటిది. పురందేశ్వరిని విమర్శించే అర్హత విజయసాయికి అసలు ఉందా?. విజయసాయిరెడ్డి గంజాయి వనంలో గంజాయి మొక్కలాంటివాడు. అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారా?. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో, దొంగలు రాజ్యమేలుతారు అంటే నేను నమ్మలేదు. అహంకారం ఉంటే నెత్తికెక్కి ఎక్కువగా మాట్లాడతారట. కళ్ళు మూసుకుపోయి, పోయే కాలం వచ్చిన వాళ్లే ఇవన్నీ మాట్లాడతారట.. ఆ లక్షణాలన్నీ నాకు విజయసాయిరెడ్డిలో కనిపిస్తున్నాయి. విశాఖ భూకుంభకోణంపై సిట్‌ కాదు.. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు వేయండి. రాజకీయ పార్టీల నేతలే కాదు.. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు.. ఇందులో ఐఏఎస్ అధికారులు సైతం ఉన్నారు. అందరి జాతకాలు బయటకు వస్తాయి. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు చేయండి. 16 నెలల పాలనలో ప్రజలకు మీరు ఏం చేశారో చెప్పాలి" అని విజయసాయిపై అయ్యన్న స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.