టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్

 

 

 

సచివాలయం ముందు సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. నష్టపోయిన రైతాంగాన్ని నష్టపరిహారం ఇచ్చి, వసతి సౌకర్యం, భోజనం అందించాలని డిమాండ్ చేశారు. అధికారులను నివేదికలు తయారు చేసే పనిలో కాకుండా వరదప్రాంతాల్లో వినియోగించాలని ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను సీఎం కిరణ్ చర్చలకు ఆహ్వానించినప్పటికీ తమ వద్దకే వచ్చి చర్చలు జరపాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమను సీఎం చర్చలకు పిలవకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.