బీజేపీతో చంద్రబాబు రహస్య ఒప్పందం..!!

ఓ వైపు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసమంటూ పలు పార్టీల మద్దతు కూడగడుతుంటే.. వైసీపీ మాత్రం చంద్రబాబు, బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్నారంటూ ఆరోపణలు చేస్తుంది.. తాజాగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

 

 

చంద్రబాబు ఓ వైపు బీజేపీతో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే మరోవైపు అవిశ్వాసం పెడుతున్నారంటూ ఆరోపణలు చేశారు.. వైసీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు దానివల్ల ఏం ఉపయోగమని ప్రశ్నించిన చంద్రబాబు, ఇప్పుడు యూటర్న్ తీసుకుని అదే పని చేస్తున్నారని విమర్శించారు.. వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా కోరుకుంటుంది.. ఏపీకి న్యాయం జరిగేందుకు ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు ఇస్తామని గతంలోనే చెప్పామని అన్నారు.. టీడీపీ దొంగల పార్టీ అయినా బీజేపీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానికి మద్దతు ఇస్తామని, లోక్‌సభలో తమ సభ్యులు లేనప్పటికీ సంఘీభావం తెలియజేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.