టీటీడీపీ మేనిఫెస్టోలో రైతులకే ప్రాధాన్యం
posted on Nov 21, 2018 2:07PM
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ,కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టింది. పొత్తులో భాగంగా 14 స్థానాలను కేటాయించగా ఆయా స్థానాల్లో టీడీపీ తరుపున అభ్యర్థులు నామినేషన్ వేశారు. తాజాగా టీడీపీ తమ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ, దేవేందర్గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. అనంతరం రమణ మీడియాతో మాట్లాడరు. అన్ని వర్గాల ప్రజలను సంప్రదించి టీడీపీ మేనిఫెస్టోను రూపకల్పన చేశామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ మేనిఫెస్టో రూపొందిందని వివరించారు. ఇందులో అత్యంత ప్రాధాన్య అంశంగా రైతంగ సమస్యలను పేర్కొనట్లు వెల్లడించారు.
మానిఫెస్టోలో పొందుపరిచిన ముఖ్యాంశాలు:
అమరవీరుల కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం, ఇల్లు, వారి సంక్షేమానికి ప్రాధాన్యత. రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ, దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింపు. అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5లకే భోజనం. ఇంటర్ నుంచే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ. విభజన బిల్లులో అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి. అన్ని జిల్లాల్లో పూలే, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు. ప్రొ. జయశంకర్ పేరుతో విద్యాసంస్థలు ఏర్పాటు. లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులు. హైద్రాబాద్ ధర్నా చౌక్ పునరుద్దరణ. ప్రతి ఏటా ఉద్యోగ కాలెండర్ విడుదల. తొలి ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 3వేల భృతి.
ప్రగతి భవన్ ప్రజా ఆస్పత్రిగా మార్పు ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు. బెల్ట్షాపులు రద్దు. బడ్జెట్లో విద్యారంగానికి రూ. 5వేల కోట్లు. హైదరాబాద్లో ఐటీఐఆర్ ఏర్పాటు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు. కుటుంబంలో ఒక్కో సభ్యుడికి 7 కేజీల చొప్పున రేషన్ బియ్యం. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీలకు సబ్ప్లాన్. బీసీలకు సబ్ప్లాన్. 58 ఏళ్లు నిండిన అనాథలు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.2వేల పింఛన్. దివ్యాంగులకు రూ.3వేలు పించన్. పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం. ప్రతి ఇంటికీ మంచినీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్.