అనైతికం.. చంద్రబాబు అరెస్ట్ పై రాష్ట్రమంతటా నిరసనలు 

టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయటం పై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల చర్యను ఖండిస్తూ టిడిపి నేతలు కార్యకర్తలు ఎక్కడికక్కడ పలు జిల్లాల్లో నిరసనలు తెలిపారు. రాజధాని గ్రామాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. పలువురు ఆందోళనకారులు రహదారుల పై టైర్లను తగులబెట్టారు. రాజధాని ప్రాంతమైన నిడమనూరు లో రైతులు , మహిళలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. భారీగా హాజరైన రాజధాని ప్రాంత రైతులు ఒక రాజధాని ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఏడు రోడ్ల కూడలి వద్ద టిడిపి శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ నేతల అరెస్టులను ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాజీ విప్ కూన రవి కుమార్ , మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఖండించారు. కర్నూలు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లోనూ ఆందోళనలు జరిగాయి.