టిడిపి సీనియర్ నేత ముద్దసాని దామోదర్ రెడ్డి మృతి
Published on: Mon Apr 9, 2012 2:51PM
టిడిపి సీనియర్ నేత ముద్దసాని దామోదర్ రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, సోమవారం నాడు మృతి చెందారు. ఆయన కరీంనగర్ జిల్లా కమలాపురి నియోజక వర్గం నుంచి ఐదు సార్లు ఏమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. చంద్రబాబు, ఎన్టిఆర్ హయంలో మూడుసార్లు మంత్రి గా పని చేశారు. ముద్దసాని దామోదర్ రెడ్డి ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పని చేస్తునాడు. ముద్దసాని దామోదర్ మృతి పట్ల టిడిపి చంద్రబాబు సంతాపం ప్రటించారు.


