ముగిసిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం...నిరసన వ్యక్తం చేస్తాం..


టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరిగిన పార్లమెంటరీ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం... టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ... సాధారణంగా జరిగే పార్లమెంటరీ సమావేశం మాదిరే ఇది జరిగిందని.. బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఇవ్వలేదని..  ఏపీకి జరిగిన నష్టంపై చర్చించామని, అన్నారు. కేంద్రంతో గట్టిగా మాట్లాడి ఏపీకి రావాల్సిన వాటిని రాబట్టాలని నిర్ణయించుకున్నామని, చర్చలు జరుగుతున్నప్పటికీ నిధులు రావట్లేదని అన్నారు. మూడున్నరేళ్లుగా పోరాడుతూనే ఉన్నామని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఏపీకి న్యాయం చేయపోతే నిరసన తెలియజేస్తామని, పార్లమెంట్ లో తమ నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడంపై పార్లమెంట్ లో తమ నిరసన వ్యక్తం చేస్తామని.. కొన్ని అంశాలపై రెండుమూడ్రోజుల్లో స్పష్టత రావచ్చని చెప్పారు.