అవును మీరు చెప్పింది వంద శాతం నిజం జగన్ గారు: కేశినేని నాని సెటైర్

 

 

తన ట్వీట్లతో సొంత పార్టీ వారిని సైతం వదలని విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా జగన్ పై సెటైర్లు వేశారు. తెలంగాణ గడ్డ పై నుండి రాష్ట్రానికి ప్రవహించే గోదావరి జలాలను ఏపీకి ఇస్తున్న కేసీఆర్ ది గొప్ప ఔదార్యం అంటూ సీఎం జగన్  మెచ్చుకోవడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైర్ విసిరారు. "నిజమే జగన్ గారూ! కేసీఆర్ ది గొప్ప ఔదార్యమే. అంత ఔదార్యం ఉంది కాబట్టే మీకు ఎన్నికల్లో కూడా సాయం చేశారు" అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో జగన్ కు కేసీఆర్ రూ.1000 కోట్లు ఇవ్వడమే కాకుండా టీడీపీ లీడర్లను నయానో భయానో వైసిపి లో చేరేలా చేసారని టీడీపీ ఆరోపణలు చేసిన విసహాయం తెలిసిందే. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకునే నాని ఏపీ సీఎం జగన్ పై సెటైర్లు వేశారని జనం అనుకుంటున్నారు.