భయం నా రక్తంలో లేదు.. కేశినేని సంచలన వ్యాఖ్యలు

 

కొద్దిరోజులుగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న కొడాలి నానికి మంత్రి పదవి రావడానికి దేవినేని ఉమా కారణమని పోస్ట్ చేసిన కేశినేని.. తాజాగా ఫేస్బుక్ లో మరో పోస్ట్ పెట్టారు.

"నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు. ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు." అని కేశినేని పోస్ట్ పెట్టారు. అయితే కేశినేని ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారో అర్థంకావడంలేదు.