టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేత !

 

ఈ రోజు ఉదయం ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ గా వ్యవహరించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెన్షన్ చేసిన విషయం విదితమే.  అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను ఆయన సస్పెండ్ చేశారు. అయితే, వీరిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తర్వాత డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కలిశారు. ఆ తర్వాత ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం టీడీపీ సభ్యులను మరోసారి చర్చలకు ఆహ్వానించారు. దీంతో వారి మీద సస్పెన్షన్ ఎత్తివేయచ్చనే వాదన వినిపిస్తోంది.