భీమవరం టీడీపీ ఎమ్మెల్యేకి అస్వస్థత

 

 

 

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అసెంబ్లీ ఆవరణలో అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరైన ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. ఛాతీలో నొప్పిగా వుందని ఆయన చెప్పడంతో ఆయన్ని హుటాహుటిన బంజారాహిల్స్.లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. పులవర్తి రామాంజనేయులు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు స్వయానా వియ్యంకుడు. గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయిపూజిత, ఆంజనేయులు కుమారుడు వెంకట్‌రామ్ ప్రశాంత్‌ల వివాహం గత ఏడాది డిసెంబర్‌‌లో జరిగింది. ప్రస్తుతం పులవర్తి రామాంజనేయులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్టు తెలుస్తోంది.